Coin club - Tirupathi

Coin club - Tirupathi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Coin club - Tirupathi, Antiques shop, 18-6-310, sundharaiah nagar, Tirupathi.

23/09/2020
18/12/2019
*గండభేరుండ పక్షి*  *( Knowledge Post* )------------------------------------------------ ఈ పక్షి పేరు  చాలామంది విని ఉంటా...
12/09/2019

*గండభేరుండ పక్షి*
*( Knowledge Post* )
------------------------------------------------
ఈ పక్షి పేరు చాలామంది విని ఉంటారు అయితే నిన్నటి రోజు నేను అనంతపురం జిల్లా తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర దేవాలయంలో శిల్పాలలో దీనిని చూడటం జరిగింది అందులోని వింత ఏమిటి అంటే ఒక పక్షి రెండు తలలను కలిగి ఉండటం ఒక వింత అయితే,తన రెండు తలల నోటితో రెండు ఏనుగులను ముక్కుతో పట్టుకుంది .....
అంటే ఆ కాలంలో 1525 సంవత్సరంలో చెక్కిన ఈ శిల్పం
శ్రీ కృష్ణదేవరాయలు పరిపాలన బహుశా శిల్పి గండభేరుండ పక్షి ఎంత బలం అయినదో తెలియజేయడానికి ఈ శిల్పం చెక్కి ఉంటాడు ....

ఇంతటి బలమైన పక్షిని విజయనగర పరిపాలనలో కనుగొన్నారు ఆనాటి చరిత్రకు సాక్షిగా ఈ గండభేరుండ పక్షిని కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంగా నియమించుకుంది ....

నేను తెలుసుకున్న
ఈ సమాచారంను
మీ అందరితో పంచుకుంటున్నాను.

Source:
విష్ణు భగవాన్
తాడిపత్రి,అనంతపురం జిల్లా
Cell:9963032665.

శుంగ సామ్రాజ్యంక్రీ.పూ 185 నుండి 75 వరకు-----------------------------------------------శుంగ సామ్రాజ్యం  పురాతన భారత రాజవ...
30/07/2019

శుంగ సామ్రాజ్యం
క్రీ.పూ 185 నుండి 75 వరకు
-----------------------------------------------
శుంగ సామ్రాజ్యం పురాతన భారత రాజవంశం, క్రీ.పూ 187 నుండి 78 వరకు మగధ నుండి మధ్య, తూర్పు ప్రాంతాల్లో భారత ఉపఖండంలో వీరి పాలన సాగింది. మౌర్య సామ్రాజ్యం పతనం తరువాత ఈ రాజవంశం పుష్యమిత్ర శుంగుడుచే స్థాపించబడింది. దీని రాజధాని పాటలీపుత్ర, కానీ తరువాత భాగభద్రా వంటి చక్రవర్తులు కూడా తూర్పు మాల్వా లోని బేస్నగర్ లో దర్బారును నిర్వహించారు
శుంగ సామ్రాజ్యం
185 BCE నుండి75 BCE వరకు కొనసాగింది.
శుంగ వంశము, క్రీ. పూ. 185 వ సంవత్సరములో, సుమారుగా అశోకుని మరణానికి 50 సంవత్సరాల తరువాత, ఏర్పాటు చేయబడింది. అప్పటి మౌర్య చక్రవర్తియైన బృహద్రథుడు, తన సైన్యాధిపతి చేతిలో దారుణంగా హత్యచేయబడ్డాడు. ఆ సైన్యాధిపతి పుష్యమిత్ర శుంగుడు, శుంగవంశము వాడు; బ్రాహ్మణుడు. ఇతను సైనిక వందనం స్వీకరించుతున్న రాజు బృహద్రధుని చంపి, తరువాత సింహాసనాన్ని అధిష్టించాడు.
పుష్యమిత్ర శుంగుడు 36 సంవత్సరాల పాటు పాలించాడు. ఆ తర్వాత అతని కుమారుడు అగ్నిమిత్ర రాజ్యాధికారం చేపట్టాడు. శుంగ సామ్రాజ్యంలో పదిమంది శుంగ పాలకులు ఉన్నారు. అయితే, రాజవంశం యొక్క రెండవ రాజు అగ్నిమిత్ర మరణం తరువాత, సామ్రాజ్యం వేగంగా విచ్ఛిన్నమైంది.
శాసనాలు మరియు నాణేలు ప్రకారం ఉత్తర; మధ్య భారతదేశం యొక్క ప్రాంతాలు చిన్న సామ్రాజ్యాలుగా, నగర-రాజ్యాలుగా శుంగ ఆధిపత్యంలో ఉండి స్వతంత్రంగా ఉన్నాయని సూచించబడ్డాయి.
ఈ రాజవంశం అనేక విదేశీ శక్తులు, స్వదేశీ శక్తులు రెండింటితోనూ జరిపిన యుద్ధాలకు ప్రసిద్ధి చెందింది. వీరు కళింగ, శాతవాహన రాజవంశం, ఇండో-గ్రీక్ రాజ్యంతో; బహుశా పాంచాల మరియు మధుర రాజులతో పోరాడారు.
ఈ కాలంలో కళ, విద్య, తత్వశాస్త్రం మరియు ఇతర రకాల అభ్యాసాలు, చిన్న చిన్న టెర్రకోట చిత్రాలు, పెద్ద రాతి శిల్పాలు, భహ్రుత్ స్తూపం, సాంచి వద్ద ప్రఖ్యాత గ్రేట్ స్తూపం ఉన్నాయి. శుంగ పాలకులు శిక్షణ, కళలకు రాయల్ స్పాన్సర్షిప్ సంప్రదాయం ఏర్పాటుకు సహాయం చేశారు. శుంగ సామ్రాజ్యం ఉపయోగించే లిపి, బ్రాహ్మీలిపికి కొంత విభిన్నంగా ఉంటుంది; ఇది సంస్కృతం వ్రాయడానికి ఉపయోగించబడింది. హిందూ తాత్వికతలో చాలా ముఖ్యమైన పరిణామాలు జరుగుతున్న కాలంలో శుంగ సామ్రాజ్యం సంస్కృతి పోషణలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. వీరి కాలంలోలోనే పతంజలి మహాభాష్యం రచించబడింది. శుంగ పాలకుల కాలంలో మధుర కళ శైలి పెరుగుదలతో పాటు కళాత్మకత కూడా పురోగమించింది,

చారిత్రక స్మృతులతో ...
-------------------------------------------------
మీ...
విష్ణు భగవాన్
తాడిపత్రి, అనంతపురం జిల్లా
Cell:9963032665.

చిక్కదేవారాయ వడయార్, మైసూర్ 14వ మహారాజు1673-1704-----------------------------------------------దేవరాజ వడయార్ II (చిక్క ద...
26/07/2019

చిక్కదేవారాయ వడయార్,
మైసూర్ 14వ మహారాజు
1673-1704
-----------------------------------------------
దేవరాజ వడయార్ II (చిక్క దేవరాజా వడయార్; 22.09.1645 జన్మించారు -
16.11.1704) మరణంచారు
1673 నుండి 1704 వరకు మైసూర్ రాజ్యం యొక్క పద్నాలుగో
మహారాజా ఈ సమయంలో, మైసూర్ తన పూర్వీకుల తరువాత మరింత గణనీయమైన విస్తరణను చూసింది.అతని పాలనలో, కేంద్రీకృత సైనిక శక్తి ఈ ప్రాంతానికి అపూర్వమైన స్థాయికి పెరిగింది.
చిక్క దేవరాజమైసూర్ మహారాజా మైసూర్ 14 వ మహారాజాపాలన
1673-1704అంతకు మునుపుదొడ్డ కెంపాదేవరాజ(పితృ మామ)వారసుడిగా
కాంతిరవ నరసరాజు II(కొడుకు) ఉన్నారు ఇప్పటి వరకు కృష్ణ రాజా వడయార్ నాణెములు సేకరణలో అక్కడక్కడా కనిపిస్తూవుంటాయి చిక్కదేవరాజ పరిపాలన నాణెము నా సేకరణలో కనిపించడం ఆనందంగా ఉన్నది,చారిత్రక స్మృతులతో ....
--------------------------------------------
మీ...
విష్ణు భగవాన్
తాడిపత్రి, అనంతపురం జిల్లా
Cell: 9963032665.

రాష్ట్రకుటుల సామ్రాజ్యం 753-982 మధ్య కాలం------------------------------------------రాష్ట్రకుటులు తాము శాక్తేయ వంశస్తులు ...
25/07/2019

రాష్ట్రకుటుల సామ్రాజ్యం
753-982 మధ్య కాలం
------------------------------------------
రాష్ట్రకుటులు తాము శాక్తేయ వంశస్తులు అని చెబుతువుంటారు అయితే ఈ విషయంలో చరిత్రకారులు భిన్నాభిప్రాయములు ఉన్నవి,రాష్ట్రకుటులు ద్రవిడ రహితము అని చరిత్రకులు చాటుతున్నారు చాళుక్య శాసనాల ప్రకారం వీరు సామంతులుగా వ్యవహరించారు,వీరి స్వస్థలం కర్ణాటక ముఖ్య భాషా కన్నడ రాష్ట్రకుటుల వ్యవస్థాపకుడు
దంతిదుర్గుడు ఇతడు చాళుక్య రాజు 2వ పులకేశి కి సమకాళికుడు,ఇతను గోదావరి,బీమా మధ్య ఉన్న అన్ని ప్రాంతాలను ఆక్రమించాడు కళింగ,కోసల,కంచి, మాళ్వ సామ్రాజ్యాలను ఆక్రమించాడు, చాళుక్య రాజు కీర్తివర్మను ఓడించి మహారాష్ర్టను తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు
దంతిదుర్గుడు తరువాత తన మేనమామ 1వ కృష్ణుడు రాజ్యధికారంలోకి వచ్చాడు, వేంగి విష్ణువర్ధనుడు,
మైసూర్ రాజు గంగ ఇతని చేతిలో పరాజయం పొందారు మొదటి కృష్ణుని కాలంలోనే ఎల్లోరా లోని కైలాసనాథ దేవాలయం నిర్మించడం జరిగింది, రాష్ట్రకుట రోజులలో అంతంత సమర్ధుడుగా పరిపాలన గాంచింది ధ్రువుడు,ఇతను స్వల్ప కాలం రాజ్యాధికారం చేసినప్పటికీ గుర్జర, ప్రతిహారా రాజులతో యుద్ధం చేసి ఒంటిచేత్తో గెలుపొంది నాడు రాష్ట్రకుటులలో అత్యంత సమర్థవంతంగా పాలన్ చేసింది 3వ గోవిందుడు అందించాడు,రాష్ట్రకుటులలో అత్యంత గొప్పవాడు 1వ ఆమోఘవర్షుడు యుద్ధంలో తూర్పు చాళుక్యులను ఓడించాడు, ఇతనే కొత్త రాజధాని
మాన్యకెట ను ఏర్పాటు చేశాడు అరబ్ వ్యాపార వేత్త సులేమాన్ తన గ్రంధంలో ప్రపంచములో అత్యంత శక్తివంతమైన 4గురి లో 1వ ఆమోఘవర్షుడు ఒక్కరని అభివర్ణించారు, వీరి తరువాత బగ్దాద్ ఖలీఫా,కాన్స్టాంట్ నోపుల్ రాజు, చైనా చక్రవర్తి గొప్పవారు, రాష్ట్రకుటుల చరిత్రలో 2వ ఆమోఘవర్షుడు,3వ ఆమోఘవర్షుడు,4వ కృష్ణుడుఅత్యంత బలహీనులు, 3వ కృషుడు అత్యంత శక్తివంతంమైన రాజు ఇతను తంజావూరు,కంచికి ఆక్రమించుకున్నాడు 10వ శతాబ్దంలో చోళులను ఓడించడం లో విజయం సాధించాడు అయితే అదే శతాబ్దం చివరి నాటికి రాష్ట్రకుట రాజు కాకుడు కల్యాణి పాలకుడు తైలవుడు చేతిలో ఓటమి చెంది హతుడు అయ్యాడు ఇంతటితో రాష్ట్రకుట చరిత్ర ముగిసింది.
--------------------------------------------------
మీ ...
విష్ణు భగవాన్
తాడిపత్రి అనంతపురం జిల్లా
Cell:9963032665.

*శ్రీలంకలో చోళ రాజ్య పాలన*  *993-1070* ---------------------------------------------శ్రీలంక ద్వీపంలో చోళ పాలన కాలం క్రీ....
25/07/2019

*శ్రీలంకలో చోళ రాజ్య పాలన*
*993-1070*
---------------------------------------------
శ్రీలంక ద్వీపంలో చోళ పాలన కాలం క్రీ.శ 993 లో, రాజా రాజా చోళ ఉత్తరాన అనురాధపుర రాజ్యాన్ని జయించిన ఒక పెద్ద చోళ సైన్యాన్ని పంపించి, చోళ సామ్రాజ్యానికి చేర్చడంతో ఆక్రమణతో ప్రారంభమైంది,అతని కుమారుడు రాజేంద్ర చోళుని పాలనలో ఈ ద్వీపం చాలావరకు ఆక్రమించబడింది మరియు విస్తారమైన చోళ సామ్రాజ్యం యొక్క ప్రావిన్స్‌గా విలీనం చేయబడింది.
ద్వీపంలో ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగిన చోళ పాలన 1070 లో బహిష్కరించబడిన సింహళ
రాజులలో ఒకరైన
విజయబాహు I నేతృత్వంలోని తిరుగుబాటు ద్వారా పడగొట్టబడుతుంది.చోళులు అనేక తరువాతి యుద్ధాలు చేసి, సింహళ రాజులు తమ వంపు-శత్రువులైన పాండ్యాలకు మిత్రులు కావడంతో అనురాధపురాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు.
-----------------------------------------
మీ ...
విష్ణు భగవాన్
తాడిపత్రి,అనంతపురం జిల్లా
Cell:9963032665

**చేజారిపోయిన*  *తొలి తెలుగు శాసనం** -------------------------------------------------తెలుగు భాషకు వెలుగు పూలు పూయించిన ...
08/07/2019

**చేజారిపోయిన*
*తొలి తెలుగు శాసనం**
-------------------------------------------------
తెలుగు భాషకు వెలుగు పూలు పూయించిన తొలి తెలుగు శాసనం. 'కలమళ్ళ శాసనం' రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన తొలి తెలుగు శాసనం

కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనాన్ని 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. నేటికి లభించిన తొలి తెలుగు శాసనాల్లో కలమళ్ళ శాసనమే ప్రప్రథమ మనడానికి అందులో వాడిన ప్రాచీన లిపి-భాషలే ప్రమాణం.
పోగొట్టుకున్నాం!
ఈసారి పోయింది అట్లాటి ఇట్లాటి వస్తువు కాదు. తెలుగు భాషకు వెలుగు పూలు పూయించిన తొలి తెలుగు శాసనం...
తెలుగు భాషకు రాజ భాష హోదాను, శాసన భాషగా ఒక అధికార ప్రతిపత్తి కల్గించి, తెలుగు భాషకు అక్షర రూపం యిచ్చి చారిత్రకంగా, సాహిత్యపరంగా ఘన వారసత్వ కీర్తిని అందించిన 'కలమళ్ళ శాసనం' -తొలి తెలుగు శాసనం ఎక్కడుందో యిప్పుడెవరికీ తెలియడం లేదు. అందరూ నిస్సహాయంగా చేతులెత్తేస్తున్నారు. దీంతో దాదాపుగా మనం తొలి తెలుగు శాసనాన్ని కోల్పోయినట్లేనని భావించాల్సి వస్తోంది. కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనాన్ని 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. ఆ తర్వాత వారితో పాటూ ఆ శాసనాన్ని మద్రాసు మ్యూజియానికి తరలించారని అందరూ భావిస్తూ వచ్చారు. ఇదే నేపథ్యంలో నేను సమాచార హక్కు చట్టం ద్వారా 07 జనవరి 2013 నాడు శాసనం నమూనా ప్రతిని, స్క్రిప్ట్‌ను జతపర్చుతూ సమగ్ర వివరాలతో చెన్నై 'ఎగ్మోర్' ప్రభుత్వ మ్యూజియం వారిని ప్రశ్నించడం జరిగింది.
తొలి తెలుగు శాసనం, రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనంకు సంబంధించిన వివరాలు, మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారా? దానిని తగిన విధంగా సంరక్షిస్తున్నారా? వంటి ప్రశ్నలను వారి ముందుంచినప్పుడు- అలాంటి శాసనమేదీ తమ వద్ద లేదని- చెన్నై ప్రభుత్వ మ్యూజియం అసిస్టెంట్ డైరక్టర్ తిరు ఎస్. సెల్వ అరసు, అధికారికంగా లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
దీంతో యింతకాలంగా ఎగ్మో ర్ మ్యూజియంలో వుందని భ్రమపడుతూ వచ్చిన శాసనం అక్కడ లేదని తేలిపోయింది. అంతకు మునుపే శాసన నిర్దేశకుల కార్యాలయం, భారతీయ పురాతత్వశాఖ, మైసూరు వారి వద్ద కూడా ఈ శాసనం లేదని వెల్లడైంది. ఈ మైసూర్ శాఖ ఎపిగ్రాఫియా ఇండియా, ఏన్యువల్ రిపోర్ట్ ఆన్ ఇండియన్ ఎపిగ్రఫీ అనే శాసన పత్రికలను కూడా ప్రచురిస్తోంది. ఈ మైసూర్ కార్యాలయానికి 125 సంవత్సరాల చరిత్ర కూడా వుంది. వీరి వద్ద రేనాటి చోళుల శాసనాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం వుంది. కానీ 'తొలి తెలుగు శాసనాన్ని' సేకరించకపోయినందుకు, సంరక్షించక పోయినందుకు మనం విచారించాల్సిందే!
ఇదే విధంగా భారతీయ పురాతత్వ సర్వేక్షణ, ఉప పురాతత్వ అధీక్షకులు- హైదరాబాదు వారిని కూడా 30 అక్టోబర్ 2012 నాడు రెండు లేఖల ద్వారా ప్రశ్నించడం జరిగింది. వారి నుంచి కూడా అసంతృప్తిని మిగిల్చే సమాధానాలే లభించాయి. తొలి తెలుగు శాసనం ఆచూకీ తమకు కూడా తెలియదని చేతులెత్తేయడం దిగ్భ్రాంతిని కల్గిస్తోంది.
సమాచార హక్కు చట్టం ద్వారా భారతీయ పురాతత్వ శాఖ, హైద్రా బాదు మండలం వారిని ఈ అంశంపై అడిగిన కొన్ని ప్రశ్నలు- వాటికి వారిచ్చిన సమాధానాలు ఇవి:

కడప జిల్లాలో బయల్పడిన 'కలమళ్ళ శాసనం' ప్రస్తుతం ఎక్కడ వుంది?

కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో 1904లో మద్రాసు నందలి శాసన పరిశోధన విభాగం వారు ఈ శాసనాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఎక్కడ వుందో తెలియదు. ?

కలమళ్ళ శాసనం పొడవు, వెడల్పు, ఆకారం, బరువు వంటి సాంకేతిక వివరాలు తెలపగలరు?

కలమళ్ళ శాసనం పొడవు, వెడల్పు, ఆకారం, బరువు వంటి సాంకేతిక వివరాలు లభించుట లేదు.

కలమళ్ళ శాసనాన్ని మొదటిసారిగా ఎవరు, ఎప్పు డు, ఎక్కడ గుర్తించారు? తర్వాత ఎక్కడికి తరలించారు? ప్రస్తుతం ఎక్క డుంది?

కలమళ్ళ శాసనాన్ని తొలిసారిగా 1904లో మద్రాసు ప్రభుత్వ శాఖ వారు కలమళ్ళ గ్రామంలోని ఆలయ ప్రాంగణంలో వున్న ట్లు గుర్తించారు. తర్వాత 1947-48 లో ఆచార్య కె.నీలకంఠ శాస్త్రి, యమ్. వెంకట రామయ్య ఈ శాసనాన్ని పరిష్కరించి ప్రచురించారు.

ఇంతకు మించి ఏ సమాచారం అందుబాటులో లేదు.

తొలి తెలుగు శాసనంగా చెప్పబడుతున్న కడప జిల్లా లోని కలమళ్ళ శాసనంను భారతీయ పురాతత్వ శాఖ తొలి తెలుగు శాసనంగా అంగీకరిస్తోందా? అంగీకరిస్తే ఆధారాలు తెలుపగలరు?

రేనాటి చోళరాజు ధనుంజయుడు వేయించిన కలమళ్ళ శిలాశాసనాన్ని తొలి తెలుగు శాసనంగా ప్రసిద్ధ శాసన పరిశోధకులు సహేతుకంగా నిర్ణయించారు. కావున మేము కూడా వారి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాము. నేటికి లభించిన తొలి తెలుగు శాసనాల్లో కలమళ్ళ శాసనమే ప్రప్రథమ మనడానికి అందులో వాడిన ప్రాచీన లిపి-భాషలే ప్రమాణం. ఎరికల్ ముత్తురాజు వేయించిన ఎర్రగుడిపాడు శాసనం, పుణ్యకుమారుడి తిప్పలూరు శాసనాలు తర్వాత క్రమంలో వచ్చి చేరుతాయి.

మీ
విష్ణు భగవాన్
తాడిపత్రి,
అనంతపురం జిల్లా
CEll:9963032665

  not for sale
12/06/2019

not for sale

For sale
27/08/2016

For sale

ID please
01/08/2016

ID please

Address

18-6-310, Sundharaiah Nagar
Tirupathi
517501

Telephone

09440079903

Website

Alerts

Be the first to know and let us send you an email when Coin club - Tirupathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category